Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియా

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:16 IST)
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ను పగులకొట్టడమే కాకుండా.. దుర్భాషలాడిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
కానీ ఈ వ్యవహారంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఫోన్ పగులకొట్టినందుకు క్షమాపణలు కూడా అడిగింది. కానీ ఫోన్ పగిలిందా లేదా అని తాను గమనించలేదని చెప్పింది. ఇంతలో ట్విట్టర్లో ఓ యువకుడు అనసూయ ఫోన్ పగులకొట్టడాన్ని తాను చూశానని ట్వీట్ చేశాడు. ఆ యువకుడి వద్ద విచారిస్తామని పోలీసులు కూడా హామీ ఇచ్చారు. దీంతో నెటిజన్లు అనసూయపై తిట్ల వర్షం కురిపించారు. 
 
క్షమాపణలు చెప్పినా చిన్నారి అభిమాని ఫోన్ పగులకొట్టిన వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. అనసూయ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతే సోషల్ మీడియా వద్దు ఏమీ వద్దు అనుకుంది. నెటిజన్ల విమర్శలకు మనస్తాపానికి గురైన అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అనసూయ అకౌంట్స్ కనిపించట్లేదు. మొత్తానికి సెల్ ఫోన్ వ్యవహారంతో అనసూయ హర్టయ్యిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యవహారంలో నెటిజన్లు ఓవరాక్షన్ చేశారని వారు మండిపడుతున్నారు.
 
ఇకపోతే.. బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం రామ్‌ చరణ్ రంగస్థలం, మోహన్ బాబు గాయత్రి సినిమాలతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న ''సచ్చిందిరా గొర్రె'' సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి ఫుడ్ ఫాయిజన్ : ఓ రోగి మృతి - మరో 70 మందికి...

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments