పేదింటి రాజుకు 'దొరసాని'గా వెళుతున్న జీవిత కుమార్తె శివాత్మిక

Webdunia
గురువారం, 30 మే 2019 (21:20 IST)
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక "దొరసాని"గా మారిపోయింది. ఓ గొప్పింటి వ్యక్తికి దొరసానిగా కారులో వెళుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ అదిరిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం దొరసాని. ఈ చిత్రానికి కె.వి.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 
 
1980 దశకంలో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి దొరసానికి మధ్య ఏర్పడిన ప్రేమ కథే ఈ 'దొరసాని' చిత్ర కథగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ మూవీస్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments