Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదింటి రాజుకు 'దొరసాని'గా వెళుతున్న జీవిత కుమార్తె శివాత్మిక

Webdunia
గురువారం, 30 మే 2019 (21:20 IST)
సీనియర్ నటి జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక "దొరసాని"గా మారిపోయింది. ఓ గొప్పింటి వ్యక్తికి దొరసానిగా కారులో వెళుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ అదిరిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం దొరసాని. ఈ చిత్రానికి కె.వి.మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్‌పై వెంబడిస్తూ హీరో ఆరాధనగా ఆమెను చూస్తున్నట్లు ఉన్న ఈ లుక్ సినిమా కథను చెప్పకనే చెబుతోంది. 
 
1980 దశకంలో ఉన్న బానిస బతుకులు, పేద ధనిక తేడాల మధ్య ఓ పేదింటి రాజుకి, గొప్పింటి దొరసానికి మధ్య ఏర్పడిన ప్రేమ కథే ఈ 'దొరసాని' చిత్ర కథగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ మూవీస్ కూడా సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments