అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ నటించిన ఊర్వశివో రాక్షసివో నుండి సాంగ్ రాబోతుంది

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (13:20 IST)
Allu Shirish and Anu Emmanuel
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.గీత గోవిందం, ప్రతిరోజు పండగే వంటి హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో". 
 
కొత్తజంటతో జనాదరణ పొందిన‌ అల్లు శిరీష్ తాజా సినిమా ఇది.  చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది.  ఇదివరకే రిలీజ్ చేసిన  "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా అక్టోబర్ 10న "ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుండి "దీంతననా" అనే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఈ చిత్రానికి అచ్చు రాజమణి  సంగీతం అందిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments