Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర జవాన్ల కుటుంబాలకు అమితాబ్ భారీ ఆర్థికసాయం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:51 IST)
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నిజంగానే రియల్ హీరో అని మరోమారు అనిపించుకున్నారు. గతంలో పలుమార్లు కూడా తాను రీల్ హీరో కాదనీ, రియల్ హీరో అని నిరూపించుకున్నారు. తాజాగా మరోమారు ఆయన ఇదేవిధంగా నడుచుకున్నారు.
 
జమ్మూకాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ఇప్పటివ‌ర‌కు 49 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చాలా మంది సెలెబ్రిటీలు తమ వంతు సాయం చేసందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ.2.5 కోట్లు ప్రకటించారు. టాలీవుడ్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న‌కి తోచినంత సాయాన్ని వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు ప్రకటించారు.
 
గతంలో దేశానికి వెన్నుద‌న్నుగా నిలిచిన రైత‌న్నని ఆదుకొని ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచారు. మ‌హారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని మాఫీ చేయించాడు. ఉత్తర ప్ర‌దేశ్‌లోని రైతు కుటుంబాల‌కి చెందిన వారి లోన్స్ మాఫీ కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. 
 
అలాగే, బ‌ల‌వంతంగా వ్య‌భిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వారి నుంచి యువ‌తుల‌ని ర‌క్షించి వారి కోసం పాటు ప‌డుతున్న అజీత్ సింగ్‌కి కూడా అమితాబ్ కొంత మొత్తం ఇస్తామ‌ని అన్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments