Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మళ్లీ కరోనా వైరస్ సోకింది : అమితాబ్ బచ్చన్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:36 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అర్థరాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు మళ్లీ కరోనా వైర సోకిందని, అందువల్ల తనను కలిసివారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
బిగ్ బికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
కాగా, అమితాబ్ కరోనా వైరస్ బారినపడటం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం కరోనా సోకినపుడు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌లు కూడా కోవిడ్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, అమితాబ్ నటించిన "బ్రహ్మాస్త్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, గుడ్‌బై, ఊంచాయి సినిమాల్లోనూ నటిస్తున్నారు. రష్మిక మందన్నాతో కలిసి మరో చిత్రంలో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments