Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్టర్ కె' షూటింగులో గాయపడిన అమితాబ్ .. ముంబై నివాసంలో విశ్రాంతి

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (11:49 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షుటింగులో గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఒక చిత్రం షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ముంబైకు వెళ్లి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా "మిస్టర్ కె" పేరుతో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. 
 
హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అమితాబ్ ప్రమాదానికు గురయ్యారు. ప్రమాదంలో ఆయన పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో రాసుకొచ్చారు.
 
ఈ ప్రమాదంలో తాను గాయపడటంతో షూటింగును రద్దు చేశారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదం నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన బ్లాగులో రాసేంత వరకు ఏ ఒక్కరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments