శ్రీదేవిలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోరు: అమితాబ్

అతిలోక సుందరి శ్రీదేవి మృతికి ముందే బిగ్ బి అమితాబ్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ''ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది'' అని అమితాబ్ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్న

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (17:19 IST)
అతిలోక సుందరి శ్రీదేవి మృతికి ముందే బిగ్ బి అమితాబ్‌ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ''ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది'' అని అమితాబ్ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్ని నిమిషాల ముందే ఈ ట్వీట్‌ చేయటం విశేషం. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్‌ ముందే ఊహించే ఆ ట్వీట్‌ చేశారా? అంటూ చర్చ సాగింది.
 
అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని.. అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి వుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. శ్రీదేవి హఠాన్మరణం అభిమానులు షాక్ తిన్నారు. ఈ విషాదంపై కొందరు సినీ ప్రముఖులు కవితలు రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా అమితాబ్ రెండు లైన్ల ట్వీట్లతో కవితను పోస్టు చేశారు. ''ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు.. అలా అని నీలా ఇంత తొందరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోరు'' అని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. అందాలతార శ్రీదేవి అద్భుతమైన నటి మాత్రమే కాదు.. ఓ మంచి కళాకారిణి కూడా. తాజాగా ఆమె పెయింటింగ్స్‌ను వేలం వేయనున్నారు. పాప్ రారాజు, మైకేల్ జాక్సన్ చిత్రాన్ని శ్రీదేవి గీసింది. ఈ పెయింటింగ్స్‌ను వేలానికి పెట్టనున్నారు. సావరియా చిత్రంలోని ఓ ఫోటోను కూడా శ్రీదేవి చిత్రంగా మలిచారు. ఈ రెండింటిని అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ వేలం వేయనున్నట్లు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments