Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన సిబ్బందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించిన బన్నీ

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:05 IST)
టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఓ సాధారణ పౌరుడులాగానే ఉంటారు. బడా నిర్మాత అల్లు అర్జున్ కుమారుడన్న భావన ఆయనలో ఇసుమంత కూడా కనిపించదు. అలాగే, తన చుట్టూ పనిచేసేవారి బాగోగులను తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు. ఇందుకు నిదర్శనమే... తాజాగా, ఆయన తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. 
 
తన టీమ్‌లోని 45 ఏళ్లకు పైబడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా సమకూర్చి, పర్యవేక్షించారు. 
 
టాలీవుడ్ అగ్రహీరోల్లో సొంతంగా ఓ టీమ్‌ను కలిగివున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. వారి బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. తన టీమ్‌లోని అనేకమందికి పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. 
 
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో తొలుత చిరంజీవి కరోనా వైరస్ బారినపడగా, ఆ తర్వాత నాగబాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ఇలా వరుసగా ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments