Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప ఫోటోగ్రాఫర్ మృతి.. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (11:24 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా రేంజ్ సినిమా పుష్ప. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
 
ఈ మూవీకి ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జి. శ్రీనివాస్ (54) మృతి చెందారు. ఇవాళ అర్థరాత్రి రాత్రి.. అంటే దాదాపు 1 గంటల ప్రాంతంలో రాజమండ్రిలో గుండెపోటుతో మరణించారు.
 
"పుష్ప" షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లికి శ్రీనివాస్ వెళ్లాడు. అయితే.. అతనికి ఒంట్లో బాగుండకపోవడంతో అంబులెన్స్‌లో రాజమండ్రికి ఆయనను తరలించారు. కానీ శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే మరణించాడు. 
 
ఈ ఘటనతో టాలీవుడ్‌ విషాద ఛాయలోకి వెళ్లింది. శ్రీనివాస్ దాదాపు 200 లకు పైగా సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమర్తెలున్నారు. ఆయన మృతికి పలుగురు సిని ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments