దేశంలో అత్యంత ప్రభావశీలి సెలెబ్రిటీల జాబితాలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క హీరోకు చోటు దక్కింది. ఆ హీరో పేరు అల్లు అర్జున్. ఈయనకు 25వ స్థానం దొక్కింది. ఈ జాబితాను లైఫ్స్టైల్ మ్యాగజైన్ జీక్యూ విడుదల చేసింది.
ఈ యంగ్ అచీవర్స్ జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే, మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో సినీ నిర్మాత కర్ణేశ్ శర్మ, రేసర్ జెహాన్ దారువుల, 3 వన్ 4 క్యాపిటల్ స్థాపకులు ప్రణవ్పై, సిద్ధార్థ్పై ఉన్నారు.