Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఉన్న అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..

ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:43 IST)
ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. టీజర్‌ విడుదలలో డివైడ్‌ టాక్‌ రావడంతో దాన్ని బాగా పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. చిత్రీకరణ 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ దుబాయిలో అబుదాబిలో జరుగుతోంది. 
 
అక్కడ అల్లు అర్జున్‌, పూజ హెగ్డేలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల్లో అల్లు అర్జున్‌ వేయబోయే స్టెప్స్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్‌ అబుదాబి సెట్స్‌‌లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని బంపరాఫర్‌ కూడా ప్రకటించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments