Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌.టి.ఆర్‌. శతజయంతి ఉత్సవాలకు అగ్రహీరోలంతా హాజరు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (20:40 IST)
prbahs, pawankalyn posters
దివంగత ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా అభిమానులతో నందమూరి బాలకృష్ణ కుటుంబం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 100 సంవత్సరాలు జయంతి సందర్భంగా తెనాలి పట్టణంలో ఏడాది పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు కూడా. ఇటీవలే సూర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా వుండగా ఫైనల్‌గా మే 20 అనగా రేపటికి శతజయంతి కాబట్టి హైదరాబాద్‌లో ఈ వేడుకను జరుపుతున్నారు.
 
రేపు సాయంత్రం 5 గంటల నుండి  హైదరాబాద్ కూకట్ పల్లి లోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరగనుంది. 
 
ఎన్‌.టి.ఆర్‌.కు నివాళి అర్పించేందుకు సినిమారంగ చరిత్రను సృష్టించిన ఆయనకు గౌరవవందనం చేసేందుకు పవన్‌ కళ్యాణ్‌, కన్నడ శివరాజ్‌కుమార్‌, ప్రభాస్‌, వెంకటేష్‌, జూ.ఎన్‌.టి.ఆర్‌. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పురందేశ్వరి, జయప్రద వంటి హేమా హేమీలు రానున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ పోస్టర్లను హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. టి.డి. జనార్దన్‌, నందమూరి కుటుంబం కలిసి చేస్తున్న ఈ ఉత్సవానికిభారీగానే ఏర్పాటు జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా రానున్నారు. అందుకు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments