Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల వైకుంఠపురంలో.." టీజ‌ర్ రిలీజ్‌కి ముహుర్తం ఖరారు

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (14:10 IST)
'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' . ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 
 
దీంతో ఈ సినిమా థియేట‌ర్స్ లోకి ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు బ‌న్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
 
అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments