Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు కుమ్మరిస్తున్న "అల వైకుంఠపురములో..."

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (08:55 IST)
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో "అలా వైకుంఠపురములో". స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, టబు, జయరాం, సముద్రఖని, రాజేంద్రప్రసాద్ వంటి అగ్రనేతలు నటించారు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన ప్రతి కేంద్రంలోనూ కనకవర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ రికార్డుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మ్యాట్నీ షోతో ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా, తొలి మూడు రోజుల్లో రూ.90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి ముందు 'దర్బార్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు విడుదలైనప్పటికీ... వీటికి సరైన పోటీ ఇస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ఇప్పటికీ నూరు శాతం ఆక్యుపెన్సీతో చిత్రం నడుస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమా అంతర్జాతీయ హక్కులను రూ.85 కోట్లకు విక్రయించగా, ఇప్పటివరకూ రూ.60 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి కలెక్షన్లు వస్తాయని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments