Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ ధరకు అల వైకుంఠపురములో రైట్స్.. ఆ సంస్థ దక్కించుకుందా?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (18:45 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. బన్నీ సరసన రెండవ సారి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమా కావడంతో దీనిపై బన్నీ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. 
 
సీనియర్ హీరోయిన్ టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, సునీల్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, అదే కంపెనీ సీఈవోగా పూజాహెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన తండ్రి పాత్రలో మురళి శర్మ నటిస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments