Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు బ్రాండ్ ప్రచారకర్తగా తప్పుకున్న అక్షయ్ కుమార్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:31 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన అభిమానులతో పాటు ప్రేక్షకులను క్షమించమని వేడుకున్నారు. విమల్ పొగాకు బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. విమల్ పొగాకు కంపెనీ తయారు చేసే మసాలా బ్రాండ్లకు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. అయితే, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు తలొంచిన అక్షయ్ కుమార్ ఈ మసాలా బ్రాండ్‌కు ప్రచారకర్త నుంచి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. 
 
ఈ తరహా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్ ఉండగా తాజాగా అక్షయ్ కుమార్ చేరారు. అయితే, అక్షయ్ కుమార్ నిర్ణయాన్ని ఆయన అభిమానులు స్వాగతించడం లేదు. తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్షయ్ కుమార్ వెనక్కి తగ్గి, ఇన్‌స్టా ఖాతాలో అభిమానులను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు. 
 
'నన్ను క్షమించండి. అభిమానులకు, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రతిస్పదంన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇకపై  పొగాకు ఉత్పత్తులు ప్రచారం చేయబోను. విమల్ ఇలైచీతో నేను జట్టుకట్టడంపై మీరు వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తాను. విమల్ ఇలైచీ నుంచి నేను తప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను' అని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments