Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా విషయంలో అసలు విషయం బయటపెట్టిన అఖిల్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, అఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డితో చేస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఇంతకీ ఏమన్నాడంటే... సురేందర్ రెడ్డితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదరింది. ఈ సినిమా మామూలుగా ఉండదు. ధూమ్ థామ్‌గా ఉంటుంది. యాక్షన్ ఉంటుంది.
 
అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని అఖిల్ చెప్పాడు. అఖిల్ ఇలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమాని అనిల్ సుంకర భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమాతో అభిమానులు ఆశించిన విజయం సాధిస్తాడని.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments