Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సినిమా విషయంలో అసలు విషయం బయటపెట్టిన అఖిల్

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:10 IST)
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే, అఖిల్ మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ రెడ్డితో చేస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు. ఇంతకీ ఏమన్నాడంటే... సురేందర్ రెడ్డితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదరింది. ఈ సినిమా మామూలుగా ఉండదు. ధూమ్ థామ్‌గా ఉంటుంది. యాక్షన్ ఉంటుంది.
 
అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాను అని అఖిల్ చెప్పాడు. అఖిల్ ఇలా చెప్పినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమాని అనిల్ సుంకర భారీ స్ధాయిలో నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఈ సినిమాతో అభిమానులు ఆశించిన విజయం సాధిస్తాడని.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments