Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేతిక శర్మ అధరాలతో 'రొమాంటిక్‌'గా ఆడుకున్న పూరీ తనయుడు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (13:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో డాషింగ్ డైరెక్టరుగా పేరుగాంచిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈయన తనయుడు ఆకాష్ పూరీ. "ఆంధ్రా పోరీ" అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో "మెహ‌బూబా" అనే సినిమా చేశాడు. ఇండియా-పాకిస్తాన్ ప్రేమ కథతో తెరకెక్కిన 'మెహబూబా' అంచనాలను అందుకోలేకపోయింది. 
 
దీంతో ఆకాష్ కెరీర్‌క కాస్త బ్రేక్ పడింది. ఇపుడు మూడేళ్ల త‌ర్వాత "రొమాంటిక్" అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాకు కథ మాటలు స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందించగా, ఆయన శిష్యుడు అనిల్ పడూరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
2019లోనే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా క‌రోనా కారణంగా ఆలస్యమైంది. లాక్డౌన్ త‌ర్వాత మిగ‌తా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి జూన్ 18న థియేట‌ర్స్‌లోకి ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. కొద్ది సేపటి క్రితం రొమాంటిక్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. 
 
ఇందులో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఒక బీచ్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా పోస్టర్స్‌పై విమర్శలు కూడా వచ్చాయి. మహిళా సంఘాలు గోల గోల చేశారు. ఈ  సినిమాతో హిట్ కొట్టాల‌ని ఆకాశ్ ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ?

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments