Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ గర్భందాల్చిన ఐశ్వర్యా రాయ్?

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (13:21 IST)
బాలీవుడ్ అందాలతార, మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ మళ్లీ గర్భందాల్చినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే ఓ బిడ్డ తల్లిగా ఉన్న ఐశ్వర్యా... ఇటీవల త‌న కూతురు, భ‌ర్త‌తో క‌లిసి ఎక్క‌డికో వెళుతున్న క్ర‌మంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షమైంది. 
 
చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుని వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. దీంతో ఐష్ గ‌ర్భ‌వ‌తి కావడం వల్లే అలా జాగ్రత్తలు తీసుకున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. 
 
అయితే, దీనిపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం పెదవి విప్పడం లేదు. 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు వివాహం కాగా, 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.
 
ఇదిలావుంటే, 1994లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్.. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసింది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఐష్ ప్ర‌స్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఐష్ స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments