Webdunia - Bharat's app for daily news and videos

Install App

RGV 'వ్యూహం' చూశాక YCP 'అరాచకం' సినిమా తీస్తా, ఆ పార్టీకి 29 సీట్లే: నట్టి కుమార్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (18:20 IST)
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై రచ్చ జరుగుతోంది. అటు జనసేన ఇటు తెదేపా కార్యకర్తలు ఈ చిత్రాన్ని విడుదల చేయరాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ఉద్యమ నాయకుడు ఏకంగా వర్మపైన మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అది కేసు నమోదు వరకూ వెళ్లింది. కాగా ఈచిత్రం రేపు విడుదల కావాల్సి వుంది.
 
మరోవైపు ఈ చిత్రం గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఆర్జీవి తెరకెక్కించిన వ్యూహం సినిమా తాను చూస్తానని అన్నారు. ఐతే ఈ చిత్రం చూసిన వెంటనే తను కూడా వైసిపి అరాచకాలపై అరాచకం సినిమా తెరకెక్కిస్తానన్నారు. ఈ చిత్రంలో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చిత్ర హింసలు ఇత్యాది వైసిపి అరాచకాలపై పూర్తి వివరాలతో సినిమా తీస్తానని చెప్పారు.
 
ఏపీ ప్రజలు వైసిపిపై తీవ్ర అసంతృప్తితో వున్నారనీ, ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 29 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తెదేపా-జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని అన్నారు. త్వరలో తను చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతాననీ, ఆ తర్వాత తను రాజకీయ కార్యాచరణ గురించి చెబుతానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments