Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నగారిని ఎంజీఎం సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు..

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (10:12 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి తర్వాత ఆయనకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలు మృతి వెనుక పెద్ద కుట్ర జరిగిందని, మనీ కోసం ఆయనని చాలా వేధించారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయం బాలు కుమారుడు చరణ్ దృష్టికి రాగా, ఆయన ఓ వీడియో ద్వారా పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.
 
"ఆస్పత్రిలో నాన్నగారి చికిత్సకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని చెప్పారు. హాస్పిటల్ బిల్లు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం సిబ్బంది నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రార్ధనలు కూడా చేశారు. దయ చేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. నాన్న గారిని అభిమానించే వాళ్ళు ఇలా చేయకూడదు. ఈ సమయంలో ఇలాంటి రూమర్స్ మమ్మల్ని మరింతగా బాధపెడతాయి. దయచేసి గమనించండి'' అని చరణ్ పేర్కొన్నారు.
 
మరోవైపు బాలుకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్‌ బిల్లును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ చెల్లించారనే వార్తలపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments