Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం.. సతీమణి జయలక్ష్మి ఇకలేరు..

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (08:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం నెలకొంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె తన భర్త చనిపోయిన 24 రోజులకే ఆమె కూడా శివైక్యం చెందారు. 
 
హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో నిద్రలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యు్లు వెల్లడించారు. తమ ఇంటి పెద్ద విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన నగరానికి చేరుకున్న తర్వాత అంత్యక్రియలను స్థానిక పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. కాగా, విశ్వనాథ్‌ను జయలక్ష్మి తన 15 యేళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా, ఈ నెల 2వ తేదీన అనారోగ్యం కారణంగా విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments