Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం.. సతీమణి జయలక్ష్మి ఇకలేరు..

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (08:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శక దిగ్గజం, కళాతపస్వి దివంగత కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం నెలకొంది. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె తన భర్త చనిపోయిన 24 రోజులకే ఆమె కూడా శివైక్యం చెందారు. 
 
హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. ఆదివారం సాయంత్రం 6.15 గంటల సమయంలో నిద్రలోనే కన్నుమూశారని కుటుంబ సభ్యు్లు వెల్లడించారు. తమ ఇంటి పెద్ద విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన నగరానికి చేరుకున్న తర్వాత అంత్యక్రియలను స్థానిక పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. కాగా, విశ్వనాథ్‌ను జయలక్ష్మి తన 15 యేళ్ల వయసులోనే వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా, ఈ నెల 2వ తేదీన అనారోగ్యం కారణంగా విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments