వాతావరణ పరిరక్షణపై సామాజిక సందేశాన్ని ఇస్తూ ఆదిత్య ఓం చేసిన చిత్రం బంధీ. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో బంధీ చిత్రానికి అనేక ప్రశంసలు దక్కాయి.
భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్గా బంధీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై పోరాడే తీరు అద్భుతంగా ఉండబోతోంది.. భారతదేశంతో పాటు ఇతర విదేశాల్లోని అనేక అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్భుతమైన విజువల్స్ను ఈ చిత్రంలో చూడబోతోన్నాం. పర్యావరణ ప్రేమికులందరినీ కదిలించేలా ఈ చిత్రం ఉండనుంది.
ఎంతో డెడికేటెడ్ యాక్టర్ అయిన ఆదిత్య ఓం బంధీ చిత్రంలో ఎన్నో రియల్ స్టంట్స్ చేశారు. అటవీ ప్రాంతంలో అనేక ఛాలెంజ్లు ఎదుర్కొంటూ అద్భుతంగా నటించారు. ఈ మూవీని ఇక ఆడియెన్స్ ముందుకు తీసుకు రావాలని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.
ఈ మూవీ కోసం మేకర్లు ఓ వ్యూహాన్ని రచించారు. ముందుగా ఈ చిత్రాన్ని కొన్ని పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తరువాత ప్రేక్షకుల రెస్పాన్స్ను బట్టి.. స్క్రీన్లు, షోలు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించకున్నారు. నిర్మాతలు వెంకటేశ్వర్ రావు దగ్గు, రఘు తిరుమల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం NGOలు, సామాజిక సంస్థలతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్లకు మంచి ఆదరణ లభించడంతో సినిమా విడుదలపై మరింత ఉత్కంఠ నెలకొంది. బంధీ చిత్రాన్ని ఫిబ్రవరి 28న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్దంగా ఉన్నారు.