Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డి నాకు పిచ్చపిచ్చగా నచ్చేశాడంటున్న హీరోయిన్...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని కాంప్లిమెంట్ దక్కింది. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రతిపక్ష నేతగా తానేంటూ నిరూపించుకుంటూ అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారిన జగన్ మోహన్ రెడ్డికి ఒక హీరోయిన్ సలాం కొడుతోందని తెలుగు సినీపరిశ్రమ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (16:03 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని కాంప్లిమెంట్ దక్కింది. ఒకవైపు కేసులు వెంటాడుతున్నా ప్రతిపక్ష నేతగా తానేంటూ నిరూపించుకుంటూ అధికారపార్టీకి కంట్లో నలుసుగా మారిన జగన్ మోహన్ రెడ్డికి ఒక హీరోయిన్ సలాం కొడుతోందని తెలుగు సినీపరిశ్రమ కోడై కూస్తోంది. జగన్ గురించి తరచూ టివీల్లో వస్తున్న వార్తలు చూసి ఆ హీరోయిన్ జగన్‌కు అభిమానిగా మారిపోయింది.
 
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. పంజాబ్‌లో పుట్టి పుణేలో పెరిగి మోడల్ కమ్ హీరోయిన్ అయిన సునీతా రాణా. జగన్ పైన అభిమానంతో పాటు ప్రేమ పెంచేసుకుంది. అంతటితో ఆగలేదు. తాజాగా మూడురోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. యువత రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనేది జగన్ మోహన్ రెడ్డిని చూసే తెలుసుకోవాలని చెప్పింది. మొదటి నుంచి తనకు రాజకీయాలంటే ఇష్టం. అందుకే రాజకీయాల గురించి న్యూస్ ఛానళ్ళను ఎక్కువగా చూస్తుంటాను. అందులోను తెలుగు ఛానళ్ళను మరీ ఎక్కువగా చూస్తుంటాను అని చెప్పింది.
 
జగన్ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా జనం లక్షలాదిగా రావడం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. అంతేకాదు ఈమధ్య కాలంలో ఇంతటి పబ్లిక్ ఫిగర్‌ను కూడా చూడలేదని సునీత చెప్పుకొచ్చింది. కేవలం పేద ప్రజల పట్ల జగన్ చూపించే ప్రేమాభిమానాలే అంతటి ఆదరణకు కారణమని చెప్పింది. ఇప్పుడు ప్రజలకు జగన్ లాంటి వ్యక్తే అవసరని చెబుతూ.. ఓటును వేసేటప్పుడు సమర్థుడా కాదా అన్నది ఖచ్చితంగా అందరూ గుర్తించుకోవాలని చెప్పింది. 
 
ఈ అమ్మడు ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. టివీ ఛానళ్ళ ఇంటర్వ్యూల తరువాత జగన్ గురించి అలా చెప్పిన సునీత ఎవరో తెలుసుకునేందుకు వైసిపి అభిమానులు తెగ ప్రయత్నిం చేస్తున్నారట. అయితే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అస్సలు స్పందించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments