Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి

తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:35 IST)
తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరడుగట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డికి కుడిభుజం అనీ, అలాంటివాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా వుంటే ఇక పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. 
 
తనను ఎన్నో అవమానాలకు గురిచేసినా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారనీ, ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డే 2019 ఎన్నికల దాకా కొనసాగితే తాము పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. తామే కాదు.. చాలామంది కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణ పీసీసి అధ్యక్షుడిని మార్చి పార్టీని బతికించుకోవాలని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17 ఏళ్ల బాలికకు బీర్ తాగించారు.. గంజాయి సిగరెట్ కాల్చమన్న తల్లిదండ్రులు (వీడియో)