Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన సినీ రంభ

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:47 IST)
ఒకపుడు తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపిన సినీ హీరోయిన్ రంభ ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఆమె అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన రంభ, తన భర్త, పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
వివాహం చేసుకుని కెనడాలో స్థిరపడిపోయిన రంభ చాలా రోజుల తర్వాత ఇటీవల భారత్‌కు వచ్చారు. గత వారం రోజులుగా చెన్నైలో ఉన్న ఆమె ఇటీవల తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సహచర సినీ నటి మీనాను కలిసి ఓదార్చారు. 
 
మంగళవారం ఉన్నట్టుండి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తన అక్క కుమార్తె పెళ్లి కోసం తిరుమలకు వచ్చిన ఆమె తన పిల్లలు, భర్తతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనానంతరం మీడియా కంటపడ్డారు. 
 
ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, దర్శనం చాలా బాగా జరిగింది. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చాను. ప్రస్తుతం ఇంతకుమించి ఏం మాట్లాడలేనని, చూడండి నాతో పాటు పిల్లలు కూడా ఉన్నారని వినయంగా సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

Monsoon session: జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Snakes: రైతు ఇంట్లో వందకు పైగా పాములు.. 50 పాముల్ని చంపేశారు.. అసలు సీన్ అక్కడే?

షిల్లాంగ్‌లో కొత్తజంట హనీమూన్, భర్త హత్య-భార్య మిస్సింగ్, పక్కనే కొబ్బరి బొండాం కొట్టే కత్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments