Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు సూచనతో ఒక్కటై... శ్రీవారి సేవలో పాల్గొన్న రంభ దంపతులు...

సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:46 IST)
సినీ నటి రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాభన్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ అవకాశాలు తగ్గిన తర్వాత కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తతో రంభ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెన్నైకు వచ్చిన రంభ.. కోర్టు ద్వారా న్యాయపోరాటానికి దిగారు. తన భర్త నెలకు రూ.2.50 లక్షల భృతి చెల్లించాలని తొలుత కోర్టుకెక్కింది. ఆ తర్వాత తనతో కాపురం చేసేలా భర్తను ఆదేశించాలని మరో పిటీషన్‌ను కూడా దాఖలు చేసింది. 
 
వీటన్నింటిని పరిశీలించిన కోర్టు.. ఇద్దరూ కలిసి సామరస్య కేంద్రంలో ఓ నిర్ణయానికి రావాలంటూ సూచన చేసింది. దీంతో వారిద్దరు మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు ఒక్కటై తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారివెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments