Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లంటేనే వణికిపోతున్న నటి.. ఎవరు? (Video)

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:46 IST)
సాధారణంగా ఏ అమ్మాయి అయినా పెళ్లి అంటే ఎగిరిగంతేస్తారు. కానీ, ఆ నటి మాత్రం పెళ్లంటే వణికిపోతోంది. దీనికి కారణం ఓ పెళ్లి ముఠా చేతిలో మోసపోవడమే. దీంతో ఇప్పట్లో పెళ్లి మాట అస్సలు ఎత్తొద్దని తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. ఆమె ఎవరో కాదు.. నటి పూర్ణ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లోనే నటించింది. పైగా, బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈమె ఇటీవల ఓ ముఠా చేతిలో మోసపోయింది. 
 
ఇటీవల పూర్ణను ఓ ముఠా వివాహం పేరిట మోసం చేసిన వ్యవహారం సినీవర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విషయమై పూర్ణ మాట్లాడుతూ, 'నాకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించి, వరుడి కోసం విచారిస్తున్నారు. ఆ సమయంలో ఓ ముఠా తన తల్లిదండ్రులను సంప్రదించింది. ఇరు కుటుంబాలు మాట్లాడుకొని వివాహానికి అంగీకరించాయి. 
 
వివాహానికి అంగీకరించిన తాను తదుపరి జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని ఇద్దరం చర్చించుకున్నాము. అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ముఠా తమతో ప్రేమతోను, అభిమానంతోను వ్యవహరించి మోసం చేశాయి. 
 
వారి గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు. ఇప్పట్లో నాకు వివాహం వద్దని తల్లిదండ్రులతో చెప్పాను. వివాహం అంటేనే నాకు భయం వేస్తుంది. ఈ దిగ్ర్భాంతి పరిస్థితుల నుంచి కోలుకొని నటనపై దృష్టి సారిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments