Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసు: కోర్టుకు హాజరైన జీవితా రాజశేఖర్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (09:23 IST)
ప్ర‌ముఖ సినీ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ చెక్ బౌన్స్ కేసులో గురువారం చిత్తూరు జిల్లా న‌గ‌రి కోర్టుకు హాజ‌ర‌య్యారు. త‌మ‌కు రూ.26 కోట్లు బ‌కాయి ప‌డ్డారంటూ ఆమెపై ఇటీవ‌ల జోస్ట‌ర్ గ్రూప్ యాజ‌మాన్యం ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. త‌మ వ‌ద్ద అప్పు తీసుకున్న జీవిత రుణాన్ని తిరిగి చెల్లించ‌లేద‌ని ఆరోపించింది. 
 
అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో డిపాజిట్ చేయ‌గా... అది బౌన్స్ అయ్యిందని పేర్కొంది. ఈ వ్యవ‌హారంపై గ్రూప్ యాజ‌మాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు... జీవితా రాజ‌శేఖ‌ర్‌కు నోటీసులు జారీ చేసింది.
 
ఈ వ్య‌వ‌హారంపై గ‌తంలోనే స్పందించిన జీవిత‌... జోస్ట‌ర్ గ్రూప్ త‌మ‌పై తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అయితే కోర్టుల‌పై త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని, కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రు అవుతామ‌ని కూడా ఆమె తెలిపారు. 
 
ఈ  క్ర‌మంలో గురువారం జ‌రిగిన కోర్టు విచార‌ణ‌కు జీవిత స్వ‌యంగా హాజ‌ర‌య్యారు. త‌న న్యాయ‌వాదుల‌ను వెంట‌బెట్టుకుని ఆమె కోర్టుకు వ‌చ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments