Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్ర శీలాన్ని శంకించడం వల్లే ఆత్మహత్య : 'నిజం' చెప్పిన హేమనాథ్!

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (12:05 IST)
తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులోని మిస్టరీ ఇపుడు వీడిపోయింది. తన శీలాన్ని శంకించడం వల్లే చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. ఇదే విషయాన్ని ఆమె ప్రియుడు, పారిశ్రామికవేత్త హేమనాథ్ స్వయంగా ఆర్డీవో, పోలీసులు జరిపిన విచారణలో వెల్లడించారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ నెల 9వ తేదీన పూందమల్లి, నజరత్‌పేటలోని ఓ నక్షత్ర హోటల్‌లో వీజే చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి చిత్ర భర్త హేమనాథ్‌ను స్థానిక పోలీసులు ఆరురోజులపాటు విచారణ జరిపిన మీదట అరెస్టు చేశారు. చిత్ర శీలాన్ని శంకించి హేమనాథ్‌ ఆమెను తరచూ చిత్రహింసలు పెట్టసాగాడు. 
 
ఈ క్రమంలో డిసెంబరు 8వ తేదీ రాత్రి సీరియల్‌ షూటింగ్‌లో చిత్ర సహనటుడితో శృంగారభరిత సన్నివేశంలో నటించడంపై ఆగ్రహం చెంది గొడవపడ్డాడని, దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నదని ఆ విచారణలో వెల్లడైంది. చిత్రను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే నేరారోపణపై హేమనాథ్‌ను అరెస్టు చేసి పొన్నేరి సబ్‌జైలుకు తరలించారు. 
 
ఇదిలావుంటే, చిత్ర, హేమనాథ్‌ గత అక్టోబరు 19వ తేదీన రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకున్నారు. దీంతో పెళ్ళయిన నెలన్నర లోగా చిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్డీవో విచారణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీపెరుంబుదూరు ఆర్డీవో దివ్యశ్రీ ఆత్మహత్య చేసుకున్న చిత్ర తల్లిదండ్రుల వద్ద విచారణ జరిపారు. 
 
ఆ తర్వాత హేమనాథ్ వద్ద ఆర్డీవో విచారణ జరిపారు. పొన్నేరి సబ్‌జైలులో ఉన్న హేమనాథ్‌ను గురువారం ఉదయం బందోబస్తు మధ్య వ్యాన్‌లో తీసుకువెళ్లి శ్రీపెరుంబుదూరు కార్యాలయంలో ఆర్డీవో దివ్యశ్రీ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఆర్డీవో దివ్యశ్రీ అడిగిన పలు ప్రశ్నలకు హేమనాథ్‌ సమాధానమిచ్చాడు. ఆర్డీవో అతడి వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు హేమనాథ్‌ను వ్యాన్‌లో పొన్నేరి సబ్‌జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments