Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (12:28 IST)
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరుతో సొమ్ము చేయాలని పేర్కొంది. 
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ రూ.21.29 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని "వీరమే వాగే సూడుం" చిత్ర నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసి, విడుదల కూడా అయింది. కానీ రుణాన్ని మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. పైగా, ఓటీటీ, శాటిలైట్ హక్కులను చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments