Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (12:28 IST)
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరుతో సొమ్ము చేయాలని పేర్కొంది. 
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ రూ.21.29 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని "వీరమే వాగే సూడుం" చిత్ర నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసి, విడుదల కూడా అయింది. కానీ రుణాన్ని మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. పైగా, ఓటీటీ, శాటిలైట్ హక్కులను చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments