Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (12:28 IST)
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరుతో సొమ్ము చేయాలని పేర్కొంది. 
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ రూ.21.29 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఈ మొత్తాన్ని "వీరమే వాగే సూడుం" చిత్ర నిర్మాణం కోసం తీసుకున్నారు. అయితే, ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసి, విడుదల కూడా అయింది. కానీ రుణాన్ని మాత్రం ఇంతవరకు చెల్లించలేదు. పైగా, ఓటీటీ, శాటిలైట్ హక్కులను చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రూ.15 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటూ హీరో విశాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments