Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్బీఐ.. రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు

ఎస్బీఐ.. రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:28 IST)
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు వివిధ రకాల సేవలని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా స్టేట్ బ్యాంక్ ఇచ్చే సేవల్లో వున్నాయి. స్టేట్ బ్యాంక్ కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను కస్టమర్స్ కోసం ఉంచడం జరిగింది. అయితే స్కీమ్స్‌లో రెండు స్కీమ్స్ చాలా ముఖ్యమైనవి. 
 
మీరు నెలకు రూ.28 చెల్లిస్తే ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. అదే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY స్కీమ్ నుండి. అలానే ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY కూడా మంచి ప్రాఫిట్‌ని ఇచ్చే స్కీమ్. అయితే ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది.
 
సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కట్టాలి. ఇక వీటి వలన కలిగే లాభాల గురించి చూస్తే.. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. 
 
దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. అయితే స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే ఈ లాభాలని పొందొచ్చు. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.350 కలిగి ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు వివిధ సంస్థల నుండి రూ.57 కోట్ల సాయo