Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని విన్నపం.. దొంగ ఓట్లపై నిలదీయాలి : హీరో శివాజీ

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (16:50 IST)
ప్రస్తుత రాజకీయాలపై సినీ హీరో శివాజీ సంచలన కామెంట్స్ చేశారు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్‌లు తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే, ఓటర్లు కూడా ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్న దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదన్నారు. సహజవనరులను దోచుకోమని చెప్పలేదన్నారు. అలాంటి నాయకులు ఇపుడు లేరన్నారు. 
 
అనంతపురంలో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను కోరారు. డబ్బులు కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నపుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందన్నారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. 
 
ఇదేకార్యక్రమంలో మరో సినీ నటుడు నాగినీడు పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments