Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

ఠాగూర్
సోమవారం, 19 మే 2025 (18:33 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని శిల్పా శిరోద్కర్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్న ఆమె.. తనకు కరోనా వైరస్ సోకినట్టు వెల్లడిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా, సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సింగపూర్‌లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. ఇక్కడ రోజుకు 2 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. 
 
అలాగే, హాంకాంగ్‌లోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారినపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments