Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతను ఆ విధంగా సంతోష పెట్టిన సాయిపల్లవి

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:19 IST)
సాయి పల్లవి. ఈ పేరు ఇపుడు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఫిదా చిత్రం తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఫిదా చిత్రంలో వచ్చినంత పేరు ఈ చిత్రాల్లో రాలేదు. తాజాగా శర్వానంద్ హీరోగా సాయిపల్లవి హీరోయిన్‌గా పడి పడి లేచె మనసు చిత్రం వచ్చింది. 
 
ఈ చిత్ర కథ ప్రేక్షకులుకు బోర్ కొట్టించేలా సాగింది. ఫలితంగా ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో చిత్ర నిర్మాతకు కొంతమేరకు నష్టాలు వచ్చాయి. దీంతో నిర్మాతను తనవంతుగా ఆదుకోవాలని సాయి పల్లవి భావించింది. 
 
అయితే ఈ విష‌యం సాయిప‌ల్ల‌వికి కూడా చేర‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్‌ని తిరిగి నిర్మాత‌ల‌కే ఇచ్చేసిందని అంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స్టార్ హీరోలు మాత్ర‌మే త‌మ రెమ్యున‌రేష‌న్‌ని ఇలా తిరిగి ఇచ్చేసిన సంద‌ర్భాలు చూశాం. 
 
కానీ నిర్మాత బాగోగులు ఆలోచించిన హీరోయిన్ త‌న పారితోషికాన్ని తిరిగి ఇవ్వడమనేది గొప్ప విష‌యం అని అంటున్నారు. సాయి ప‌ల్ల‌వి చేసిన ప‌నికి ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. సాయి ప‌ల్ల‌వి న‌టించిన "మారి 2" కూడా ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో సూర్య కూడా ఓ చిత్రంలో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments