ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న రజనీకాంత్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (08:29 IST)
ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లమని చెప్పడంతో ఆదివారం రాత్రి ఆయన తన ఇంటికి చేరారు. 
 
కాగా, అక్టోబరు 25వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆ 27వ తేదీన తాను నటించిన కొత్త చిత్రం అన్నాత్తను తన కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. ఆ మరుసటి రోజు అంటే 28న అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. 
 
ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనిలో సమస్య ఉన్నట్టు గుర్తించి, మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్‌ను ప్రొసీజర్ ద్వారా తొలగించారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన రజనీ.. 'ఇంట్లో దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ఫొటో'ను షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

Pawan Kalyan: మిత్రుడు రామ్‌కు పవన్ కీలక పగ్గాలు.. నాగబాబు ఉత్తరాంధ్రకే పరిమితం

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments