Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న రజనీకాంత్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (08:29 IST)
ఇటీవల అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన్ను వైద్యులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లమని చెప్పడంతో ఆదివారం రాత్రి ఆయన తన ఇంటికి చేరారు. 
 
కాగా, అక్టోబరు 25వ తేదీన ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆ 27వ తేదీన తాను నటించిన కొత్త చిత్రం అన్నాత్తను తన కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. ఆ మరుసటి రోజు అంటే 28న అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. 
 
ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనిలో సమస్య ఉన్నట్టు గుర్తించి, మెదడులోని రక్తనాళాల్లో ఏర్పడిన బ్లాక్స్‌ను ప్రొసీజర్ ద్వారా తొలగించారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. తాను డిశ్చార్జ్ అయిన విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన రజనీ.. 'ఇంట్లో దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ఫొటో'ను షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎన్నికల కౌంటింగ్.. బెట్టింగ్‌లు.. నరాలు తెగే ఉత్కంఠ.. గెలుపు ఎవరిదో..?

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments