Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు... ఎందుకు?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (11:41 IST)
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో అక్కినేని నాగార్జున గోవా ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఉత్తర గోవాలో ఎంతో పేరుగాంచిన మాండ్రమ్ బీచ్ వద్ద హీరో నాగార్జున రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఇది చట్ట విరుద్ధమని పేర్కొంటూ గోవా పంచాయతీ రాజ్ చట్టం కింద నోటీసులు జారీ చేసింది. రెసిడెన్షియల్ ప్రాజెక్టు పనులు తక్షణం నిలిపివేయకుంటే చర్యలు తప్పవని ఆ నోటీసులు పేర్కొన్నారు. 
 
ఉత్తర గోవాలో ఎంతో పాపులర్ అయిన మాండ్రమ్ విలేజ్‌లో నాగార్జున ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టును తలపెట్టారు. ఈ నిర్మాణానికి నాగార్జున ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆ గ్రామ సర్పంచ్ అమిత్ సావంత్ ఆరోపించారు. వారి వద్ద అనుమతి ఉంటే కనుక దానిని చూపించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాలని కోరారు. 
 
ఆయన నటుడా? మరొకరా? అన్న సంగతి తమకు తెలియదని, అయితే తాము చట్టబద్ధంగా కట్టే నిర్మాణాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మాండ్రమ్ అనేది నార్త్ గోవాలో ఓ ప్రముఖమైన బీచ్. ఇక్కడి పర్యాటకులకు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది ప్రధాన బీచ్ హబ్‌గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments