Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు తిండి కూడా పెట్టని నిర్మాతలున్నారు.. మూడు రోజులు పస్తుండిపోయా..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:21 IST)
సినీ ఇండస్ట్రీలో వస్తే రా అంటే.. రాకపోతే నువ్వెవరో నేనెవరో అంటారు. తాను వస్తుంటే నిర్మాతలు చూసి చూడకుండా తప్పుకున్న సందర్భాలున్నాయని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ.. సినీ రంగంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెప్పుకున్నారు. 
 
ఒకటి రెండు సినిమాల తర్వాత.. డబ్బు వస్తే సరిపోయింది.. లేకుంటే నువ్వెవరో నేనేవరో అనేలా వ్యవహరిస్తారు. అసలు తనకు తిండి కూడా పెట్టని నిర్మాతలు వున్నారు. సెట్‌లో కుర్చీ ఇవ్వని ప్రొడ్యూసర్లూ ఉన్నారు. కొన్ని ఎక్స్‌పెరిమెంట్లు కూడా చేశాను. పస్తువుంటే ఏమౌతుందని మూడు రోజులు పస్తుండిపోయానని జగపతి బాబు తెలిపారు.
 
ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ పట్టుకు తిరిగేవాడిని, ఫోన్లు వస్తాయని.. ఇంట్లో అటూ ఇటూ తిరిగేవాడిని. ఓ రోజు ఇంటి గేటు ఓపెన్ అయ్యింది. ఆటోలో వెళ్తూ వెళ్తూ.. సినిమా తీద్దామనుకుంటున్నా.. నిర్మాత, దర్శకుడు, హీరో తానే అన్నాడు. మరి తన సంగతేంటి అంటే ఓ క్యారెక్టర్ అన్నారు. అప్పట్లో తానంటే అంత చులకనగా వుండేదని జగపతిబాబు చెప్పాడు.
 
అయితే డిజైనర్‌ రామ్‌ ఫొటో సెషన్‌ తనకు బాగా సహకరించింది. ఆ ఫొటో బయటికి వెళ్లడం, బోయపాటి శ్రీను ''లెజెండ్'' కోసం అడగడం జరిగాయి. వారం పది రోజులు వాళ్లు డిలే చేశారు. తనకు టెన్షన్ మొదలైంది. వాళ్లకేమో తాను విలన్‌గా చేస్తానో చేయనోనని టెన్షన్‌. మొత్తానికి వాళ్లొచ్చారు. తాను అనుకున్న దానికంటే ఎక్కువే పారితోషికం ఇచ్చారు. 
 
కేవలం తన మీదున్న అభిమానంతో అనుకున్న దానికంటే డబుల్‌గా డబ్బిచ్చారు. ''లెజెండ్‌'' సినిమా చేసేటప్పుడు అర్ధరాత్రిళ్లు లేచి ఏడ్చేసేవాడిని. తానేంటి ఇంత క్రూరంగా వుంటానా అని ఏడుపు వచ్చేది. కానీ హీరో నుంచి విలన్‌గా మారినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని.. అప్పుడే తాను ఓ నటుడిని అనే ఫీలింగ్ కలిగిందని జగపతిబాబు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments