"ఆచార్య" ప్రిరిలీజ్ వేదికను మార్చారు...

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (15:48 IST)
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఇది చిరంజీవి 152వ చిత్రం. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటించారు. 
 
దేవాలయ భూములు కుంభకోణం నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం. ఇందులో చెర్రీ సిద్ధ అనే పాత్రను పోషించారు. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రిరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడ వేదికగా మార్చాలని భావించారు. కానీ, చిత్రం యూనిట్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. హైదరాబాద్ నగరంలో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించింది. 
 
నిజానికి విజయవాడలో జరిగే వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వేడుక హైదరాబాద్‌కు మారింది కాబట్టి ముఖ్య అతిథి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ వేడుకను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments