Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు... సిద్ధ న్యూ లుక్ రిలీజ్

Webdunia
శనివారం, 10 జులై 2021 (17:11 IST)
మెగాస్టార్ చిరంజీవి -  దర్శకుడు కొరటల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు ఆఖరి షెడ్యూల్‌లో అడుగుపెట్టింది. 
 
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్ర షూటింగ్‌ను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. 
 
"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments