Webdunia - Bharat's app for daily news and videos

Install App

'2.O' మూవీ దెబ్బకు 12 వేల పైరసీ వెబ్‌సైట్లు బ్లాక్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:39 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌లు నటించిన చిత్రం "2పాయింట్ఓ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాతలను పైరసీ భూతం ఎంతో భయాందోళనలకు గురిచేసింది. 
 
సినిమా రిలీజ్ రోజే చిత్రం వైబ్‌సైట్స్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ప్ర‌స్తుతం త‌మిళ్ రాక‌ర్స్ అనే సంస్థ పైరసీ రారాజుగా మారిపోయిన విషయం తెల్సిందే. ఎంత‌టి పెద్ద హీరో సినిమా అయిన దానిని నిమిషాల‌లో పైర‌సీగా మార్చి వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తోంది. 
 
దీంతో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన "2.0" చిత్రం పైర‌సీ బారినప‌డ‌కుండా చూడాల‌ని చిత్ర నిర్మాణ సంస్థ మ‌ద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఎం.సుంద‌ర్ కీలక ఆదేశాలు జారీచేశారు. 
 
పైరసీకి పాల్పడుతున్న 12 వేల వెబ్‌సైట్స్‌ని బ్లాక్ చేయ‌మ‌ని 37 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి ఆదేశించాడు. ఇందులో 2,000 కంటే ఎక్కువ వెబ్‌సైట్స్ తమిళ్ రాకర్స్ ఆధీనంలో ఉండటం గమనార్హం. అయితే, న్యాయస్థానం ఆదేశాల తర్వాత అయిన ఈ చిత్రం పైరసీ బారినపడకుండా ఉంటుంగా లేదో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments