Webdunia - Bharat's app for daily news and videos

Install App

#2Point0Release : రజనీ ఎంట్రీ... స్క్రీన్ ఫ్రీజ్.. డప్పు వాయిస్తూ చిందేసిన ఫ్యాన్స్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (14:24 IST)
తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2.O". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ హిట్ అంటూ ప్రతి సినీ క్రిటిక్ తమతమ రివ్యూల్లో పేర్కొంటున్నారు. అయితే, ముంబైలోని వాడ్లా ఐమ్యాక్స్ థియేట‌ర్‌లో ర‌జ‌నీ అభిమానులు చిందేశారు. ఫిల్మ్‌లో త‌లైవా రజ‌నీ ఎంట్రీ షాట్‌ను 3 నిమిషాల పాటు ఫ్రీజ్ చేశారు. ఆస‌మ‌యంలో ర‌జ‌నీ అభిమానులు థియేట‌ర్ స్క్రీన్ ముందు డ్యాన్స్‌తో చెల‌రేగిపోయారు. ర‌జ‌నీ ఫ‌స్ట్ ఫ్రేమ్‌ను చూసిన ప్రేక్ష‌కులు.. డ‌ప్పు వాయిస్తూ చిందేస్తూ నానా హంగామా సృష్టించారు. 
 
ఇదిలావుంటే, ర‌జనీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ఒక్క మాట‌లో ఈ మూవీని ఆకాశానికి ఎత్తింది. 'ఓ మై గాడ్!! "2.O" చిత్రం ఇప్పటివరకూ మనం ఈ ప్రపంచంలో చూడని ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది' అంటూ ట్వీట్‌లో పేర్కొంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌తో పాటు పలు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉందంటూ రివ్యూలు ఇస్తున్నారు. 
 
అక్ష‌య్ కుమార్ పాత్ర‌లో మ‌రో న‌టుడిని ఊహించుకోలేక‌మ‌ని, అమీ జాక్స‌న్ చాలా అద్భుతంగా న‌టించింద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. ఊహించిన‌ట్టుగానే ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఇక రికార్డుల వేట మొద‌లైంది. మొద‌టి రోజు ఈ చిత్రం ఎన్ని కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుందా అని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

ఆ మహిళ చనిపోయింది... ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని వెల్లడించింది...

యేడాదికి రూ.20 లక్షలు సంపాదిస్తున్నా... ఓ ఇంటిని కొనుగోలు చేయలేకపోయా!

శ్రేయాస్ అయ్యర్‌ను పెళ్లి చేసుకున్న ఎడిన్ రోజ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments