Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.710.98 కోట్లు వసూలు చేసిన చిట్టి

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2పాయింట్ఓ". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం గత నెల 29వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించిన ఈ చిత్రం పూర్తి సైంటిఫిక్ ఫిక్షన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ.710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో '2.O' వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
 
ఈ చిత్రం మొదటి వారంలో రూ.526.86 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో తొలి రోజున రూ.27.31 కోట్లు, 2వ రోజున రూ.32.57 కోట్లు, 3వ రోజున రూ.36.465 కోట్లు, 4వ రోజున రూ.39.20 కోట్లు, 5వ రోజున రూ.17.13 కోట్లు, 6వ రోజున రూ.14.66 కోట్లు, 7వ రోజున రూ.16.80 కోట్లు కలిపి మొత్తం రూ.710.98 కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments