Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.710.98 కోట్లు వసూలు చేసిన చిట్టి

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2పాయింట్ఓ". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం గత నెల 29వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించిన ఈ చిత్రం పూర్తి సైంటిఫిక్ ఫిక్షన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ.710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో '2.O' వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
 
ఈ చిత్రం మొదటి వారంలో రూ.526.86 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో తొలి రోజున రూ.27.31 కోట్లు, 2వ రోజున రూ.32.57 కోట్లు, 3వ రోజున రూ.36.465 కోట్లు, 4వ రోజున రూ.39.20 కోట్లు, 5వ రోజున రూ.17.13 కోట్లు, 6వ రోజున రూ.14.66 కోట్లు, 7వ రోజున రూ.16.80 కోట్లు కలిపి మొత్తం రూ.710.98 కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments