Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.710.98 కోట్లు వసూలు చేసిన చిట్టి

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "2పాయింట్ఓ". శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అత్యంత కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం గత నెల 29వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
అక్షయ్ కుమార్ పక్షిరాజుగా నటించిన ఈ చిత్రం పూర్తి సైంటిఫిక్ ఫిక్షన్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.700 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్నటివరకు రూ.710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ.166 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో '2.O' వందకు పైగా థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
 
ఈ చిత్రం మొదటి వారంలో రూ.526.86 కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో తొలి రోజున రూ.27.31 కోట్లు, 2వ రోజున రూ.32.57 కోట్లు, 3వ రోజున రూ.36.465 కోట్లు, 4వ రోజున రూ.39.20 కోట్లు, 5వ రోజున రూ.17.13 కోట్లు, 6వ రోజున రూ.14.66 కోట్లు, 7వ రోజున రూ.16.80 కోట్లు కలిపి మొత్తం రూ.710.98 కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments