టిల్లు స్క్వేర్ తో కల్చర్ గాడి తప్పుతుందా, సిద్దు అలరిస్తాడా?

డీవీ
మంగళవారం, 26 మార్చి 2024 (16:48 IST)
Anupama, siddu
సిద్దు జొన్నలగడ్డ నటించిన  డీజే టిల్లు  2022 లో థియేటర్ల లో రిలీజ్ అయి యూత్ ను ఒక్కసారిగా ఆకట్టుకుంది. సాంప్రదాయపద్దతులు గల తండ్రి, అవి ఇప్పటికి పాతపడిపోయినవి చెప్పే కొడుకు మధ్య జరిగే కథతోపాటు మర్డర్ ఓ అంశంగా తీసుకుని తీశారు. ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశాడు సిద్దు. ఇప్పుడు సీక్వెల్ కూడా మూడు రోజుల్లో రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు దర్శకుడు, హీరోకు మధ్య విభేదాలున్నాయని కథనాలు కూడా వచ్చాయి.
 
అలాంటివి ఏమీ లేవనీ. కథ ప్రకారం తను చేయాల్సింది చేశాడు అని దర్శకుడు డైరెక్టర్ మల్లిక్ రామ్ తెలియజేశాడు. మొదటి భాగంలో సినిమా ద్వారా దర్శకుడికంటే హీరోకే పేరు వచ్చింది. దానికి ఆయన ఎవరికి పేరు వచ్చినా ఓకే అనేవిధంగా మాట్లాడాడు. 
 
ఇదిలా వుండగా, టిల్లు స్వేర్ లో టిల్లు చిత్రానికి మించి సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. ఇప్పటి కల్చర్ పేరుతో రకరకాలుగా కొత్త పోకడలు తీసుకురావడం, కోట్లాదిమంది మైండ్ లో కొత్త కాన్సెప్ట్ లు ఎక్కించడం ఎంతవరకు సబబు? అనేది ప్రశ్నగా మారింది. మనకు తెలీకుండా బయట చాలా ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు సీక్వెల్ లో హీరో, దర్శకుడు చూపించబోతున్నారు. పాష్ కల్చర్ పేరుతో లేడీస్ ఎక్కువగా ఎక్సపోజ్ చేయడం, బూతులు మాట్లాడటం, బాష కూడా విదేశీ కల్చర్ కు అనుగుణం గా ఉండటం అనేవి కేవలం అక్కడివారిని బేస్ చేసుకుని సినిమాలు తీస్తున్నారని తరచూ దర్శక నిర్మాతలు చెపుతున్నారు. మరి ఈ పోకడ ఎంత దూరం పోతుందే ప్రేక్షకులే తీర్పు చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments