మహేష్ చిత్రంలో విజయశాంతి... ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాత సై

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:56 IST)
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న మహర్షి సినిమా మే 9వ తేదీన విడుదల కాబోతోంది. దీని తర్వాత మహేష్‌బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాలో అలనాటి నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.  
 
ఈ సినిమా కోసం ఇప్పటికే యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే మహేష్ సినిమా కావడంతో ఇందులో నటించేందుకు రాములమ్మ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి భారీగా కోటిన్నర డిమాండ్ చేసిందని వినికిడి. ఎక్కువ మొత్తం అయినప్పటికీ ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. 
 
విజయశాంతి హీరోయిన్‌గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. అప్పట్లో శ్రీరాములమ్మ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత కూడా విజయశాంతి అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments