Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దర్బార్' దుమారం : డబ్బులుంటే ఖైదీలు కూడా షాపింగ్‌కు వెళ్లొచ్చు... ఆమెను ఉద్దేశించేనా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (14:18 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయనతార, నివేదా థామస్‌లు నటించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. అయితే, ఈ చిత్రంలోని ఓ డైలాగ్ ఇపుడు తమిళనాట పెను దుమారాన్ని రేపింది. ఆ డైలాగ్ కూడా జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళను ఉద్దేశించినదిగా ఉందంటూ పలువురు ఆమె అనుచరులు రచ్చ చేస్తున్నారు. పైగా, ఈ డైలాగ్‌ను తొలగించాలంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో దర్బార్ చిత్రంలోని ఈ డైలాగ్ ఇపుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది.  
 
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒక సన్నివేశంలో జైలులో ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అప్పుడు డబ్బులుంటే ఖైదీలు షాపింగ్‌ కూడా వెళ్లొచ్చన్న డైలాగ్‌ ఉంది. ఆ సన్నివేశంలో ఎక్కడా శశికళ పేరు లేకపోయినా.. అది శశికళను ఉద్దేశించే పెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా తమిళనాట కనకవర్షం కురిపిస్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అలాగే, తెలుగులో కూడా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఫలితంగా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.7.5 కోట్ల గ్రాస్‌ను .. రూ.4.5 కోట్ల షేర్‌ను సాధించింది. ఇవి చెప్పుకోదగిన వసూళ్లేనని అంటున్నారు. ఓవర్సీస్‌లోను ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. తెలుగు వెర్షన్ సంగతి అటుంచితే, తమిళనాట మాత్రం అందరి అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments