Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రం.. బడ్జెట్ రూ.150 కోట్లు

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:57 IST)
ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'బాహుబ‌లి'. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌డానికి రాజ‌మౌళి ప‌క్కా ప్ర‌ణాళిక రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన రానుంది. 
 
ఈ సినిమా తర్వాత ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తెలుగు.. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి రూ.150 కోట్లు ఖర్చు పెట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియన్స్‌ను తీసుకోనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. మొత్తానికి ప్రభాస్ తదుపరి సినిమా కూడా భారీదేనన్నమాట!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments