Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్?

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (13:14 IST)
'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలే నిజమైతే తొమ్మిదేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది. 
 
నిజానికి గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు 'బాహుబలి' తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. 
 
బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, దర్శకధీరుడు మాత్రం మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
 
మరోవైపు.. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్‌తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే దర్శకధీరుడే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!

పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!

కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments