Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ మూవీ కోసం సింగీతం, అసలు సీక్రెట్ ఇదే

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:10 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కాదు పాన్ వరల్డ్ మూవీ అనగానే అసలు కథ ఏంటి.? ప్రభాస్‌ని నాగ్ అశ్విన్ ఎలా చూపించబోతున్నారు అని అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఆసక్తి ఏర్పడింది.
 
అయితే.. కథ గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారు. ఆయన గైడెన్స్‌లో నాగ్ అశ్విన్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ మూవీ స్టోరీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇది టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా అట.
 
సింగీతం శ్రీనివాసరావు టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే ఆదిత్య 369 సినిమాని తీసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా ఆదిత్య 999 తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు కానీ.. ఇంకా సెట్ కాలేదు.
 
ఇదిలా ఉంటే... టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో సినిమా తీసిన అనుభవం ఉండటం వలన ఈ మూవీకి ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలిసింది. ఇది ప్రభాస్ మూవీ కోసం సింగీతంను తీసుకోవడం వెనకున్న సీక్రెట్..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments